చెల్లెల్ని రేప్ చేసిన వాడ్ని జైల్లోనే చంపిన అన్న

  • Published By: murthy ,Published On : July 1, 2020 / 08:59 AM IST
చెల్లెల్ని రేప్ చేసిన వాడ్ని జైల్లోనే చంపిన అన్న

Updated On : July 1, 2020 / 10:32 AM IST

తన చెల్లెని అత్యాచారం చేసినవాడ్ని వెంటాడి పగ తీర్చుకున్నాడో అన్నయ్య. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీ తీహార్ జైలులో జరిగింది.

నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) అనే వ్యక్తిఅంబేద్కర్ నగర్ కి చెందిన జాకీర్(21) అనే యువకుడి మైనర్ చెల్లెలిని 2014 లో అత్యాచారం చేశాడు. ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేసి మెహతాబ్ కి శిక్ష పడేలా చేశారు. దీంతో మొహతాబ్ ను తీహార్ జైలుకు తరలించారు.

చెల్లెలిని రేప్ చేసినందుకు, ఆమె మరణానికి కారణమైన మెహతాబ్ పై జాకీర్ పగ పెంచుకున్నాడు. తీహార్ జైలులో శిక్ష అనుకభవిస్తున్న మెహతాబ్ ను ఎలాగైనా చంపాలని పగతో రగిలి పోయాడు. అందుకు ప్లాన్ వేశాడు. తాను కూడా మరో నేరం చేశాడు. హత్యా నేరం రుజువుకావటంతో2018 లో జాకీర్ తీహార్ జైలుకువెళ్లాడు. తీహార్ జైలులో తానుఉంటున్నవార్డు, మెహతాబ్ ఉంటున్నవార్డు, రేపిస్టు మెహతాబ్ ఉంటున్నవార్డు వేరు కావటంతో మాస్టర్ ప్లాన్ వేశాడు.

తన వార్డులో ఉంటున్న ఖైదీలతో గొడవ పెట్టుకుని వాళ్లను చితకొట్టాడు. దీంతో జైలు వార్డెన్ అతడిని వార్డు మార్చి రేపిస్టు మెహతాబ్ ఉండే వార్డులో వేశారు. ఇదే చాన్స్ కోసం ఎదురు చూసిన జాకీర్ సమయం కోసం వేచి చూశాడు. సోమవారం, జూన్ 27 ఉదయం ఖైదీలందరూ ప్రార్ధన కోసం బయటకు వచ్చినప్పుడు అప్పటికే రెడీగా ఉంచుకున్న కత్తిలాంటి పదునైన ఆయుధంతో జాకీర్, మెహతాబ్ పై దాడి చేసాడు.

అతని మెడపై ఒంటిపై విచక్షణా రహితంగా పొడిచేయచటంతో తీవ్ర గాయాలై కింద పడిపోయాడు. జైలు అధికారులు వెంటనే అతడిని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. జాకీర్ పై హరినగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Read:వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య