Twins Suspect Murder : అనుమానాస్పదస్ధితిలో కవల పిల్లలు మృతి

నెల్లూరుజిల్లా మనుబోలులోవిషాదకర సంఘటన చోటు చేసుకుంది. పదినెలల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు అనుమానస్పద స్ధితిలో మరణించారు. నిన్న సాయంత్రం తల్లిపాలుతాగిన తర్వాత నుంచి వారిద్దరూల అస్వస్ధతకు గురయ్యారు.

Twins Suspect Murder : అనుమానాస్పదస్ధితిలో కవల పిల్లలు మృతి

Twins Suspect Death

Updated On : June 21, 2021 / 6:51 PM IST

Twins Suspect Murder :  నెల్లూరుజిల్లా మనుబోలులోవిషాదకర సంఘటన చోటు చేసుకుంది. పదినెలల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు అనుమానస్పద స్ధితిలో మరణించారు. నిన్న సాయంత్రం తల్లిపాలుతాగిన తర్వాత నుంచి వారిద్దరూల అస్వస్ధతకు గురయ్యారు.

దీంతో వారిని నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా… పరీక్షించిన వైద్యులు వారిద్దరూ అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే దంపతులు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.