Gold Seized : ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కిలోల బంగారం, 100 కిలోల వెండి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.
Gold Seized : మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. శుక్రవారం ముంబై-హౌరా మెయిల్ లో అకోలా స్టేషన్ లో దిగిన ఒక ప్రయాణికుడు తన వద్ద ఉన్న భారీ లగేజిని బయటకు తీసుకు వెళ్లటానికి ఇబ్బంది పడుతున్నాడు.
ఆ క్రమంలో అతని ప్రవర్తన ఆర్పీఎఫ్ సిబ్బందికి అనుమనాస్పదంగా కనిపించింది. దీంతో వారు అతని వద్దకు వచ్చి బ్యాగ్ లు తెరిచి చూపించాల్సిందిగా కోరారు. అందుకు అతడు తిరస్కరించాడు. దీంతో వారు అతడిని ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్కు తరలించారు.
అక్కడ ఆ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్లు తనిఖీ చేయగా అందులో రెండుకిలోల బంగారం కడ్డీలు… 100 కిలోల వెండి బిస్కట్లు లభించాయి. తాను ఒక కొరియర్ సంస్ధలో పని చేస్తున్నట్లు ఆవ్యక్తి చెప్పాడని ఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు.