ఏపీలో సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ సెరికల్చర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. మార్చి 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని పోస్టులను కూడా జోన్-4 పరిధిలో భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుల ఆధారంగా స్క్రీనింగ్ పరీక్ష తేదీలను వెల్లడించనుండగా.. మెయిన్ పరీక్షను మే 21, 22 తేదీల్లో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు.
* సెరికల్చర్ ఆఫీసర్: 13 పోస్టులు
పోస్టుల వివరాలు..
* అర్హత:
సంబంధిత విభాగంలో PG ఉండాలి. అగ్రికల్చర్ డిగ్రీలో బోటనీ/జువాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సెరికల్చర్లో PG చదువుతున్న వారు లేదా పీజీ డిప్లొమా కలిగి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
* వయసు:
01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
* దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. SC, ST, BC, తెల్లరేషన్ కార్డు దారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
* దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
* ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, దేహదారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు.
* ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 06.03.2019 |
ఫీజు చెల్లించడానికి చివరితేది | 26.03.2019 |
దరఖాస్తుల చివరితేది | 27.03.2019 |
మెయిన్ పరీక్ష తేది | మే 21, 22 తేదీల్లో |