వయోపరిమితి పెంపు : నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 05:50 AM IST
వయోపరిమితి పెంపు : నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

Updated On : November 16, 2019 / 5:50 AM IST

నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన

నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దిశగా సాధారణ పరిపాలన శాఖ కసరత్తు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వయో పరిమితిని 42 ఏళ్ల వరకు పెంచారు. ఆ జీవో గడువు ఇటీవలే ముగిసింది. దాంతో వయో పరిమితిని సడలించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. 

వయోపరిమితిని 42 ఏళ్ల కంటే అదనంగా ఏడాది లేదా రెండేళ్లకు పెంచే విషయమై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వయోపరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోవచ్చని, ఆ తర్వాత అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తారని తెలుస్తోంది. వయో పరిమితిని సడలించాలన్న ప్రభుత్వం ఆలోచన పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయో పరిమితిని పెంచడం ద్వారా తమకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.

జగన్ సీఎం అయ్యాక ఏపీలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి ఫిలప్ చేస్తున్నారు. సచివాలయాలను నెలకొల్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. 2020 నుంచి ప్రతి ఏటా జనవరిలో కొత్త ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వ కొలువు కోసం ప్రిపేర్ అవుతున్నారు.

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లకు ముందే వయో పరిమితి పెంపు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితి 34 సంవత్సరాలు. ప్రతీ ఏటా జనవరిలో కొత్త ఉద్యోగాల భర్తీతో పాటు ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీలో పూర్తి స్థాయిలో చాలా కాలంగా ఉద్యోగాల భర్తీ లేకపోవటంతో.. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు వయోపెరిమితి దాటిపోయింది. దీంతో వారికి ఊరట ఇచ్చేలా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఏ వయసు వరకు సడలింపు ఇవ్వాలనే దానిపై చర్చ జరుగుతోంది.

వయో పరిమితి సడలింపు నిర్ణయాలతో పాటుగా.. ఏ వయసు వారు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారనే అంశంపై ప్రభుత్వం సమాచారం తెప్పిస్తోంది. తాము తీసుకునే నిర్ణయం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలగాలని భావిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వయో పరిమితిని 42 ఏళ్లకు సడలిస్తూ జీవో తెచ్చారు. దాని గడువు సెప్టెంబర్ తో ముగిసింది. దీంతో.. కొత్త నోటిఫికేషన్ల జారీకి ముందే వయో పరిమితి సడలించాలన్నది జగన్ ప్రభుత్వం యోచన.