కరోనా ఎఫెక్ట్ : whatsappలో పరీక్షా ఫలితాలు

కరోనా విజృంభిస్తోంది. చైనా వచ్చిన ఈ మహమ్మారీ వేలాది మందిని బలి తీసుకొంటోంది. భారత్లో కూడా మెల్లిగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన కొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు చనిపోవడం కలకలం రేపుతోంది. వైరస్ విస్తరించకుండా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయించారు.
అయితే..పలు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలను మాత్రం పోస్ట్ పోన్డ్ చేయలేదు. దేశ రాజధానిలో కూడా స్కూల్స్ మూతపడ్డాయి. అయితే.. కేంద్ర విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. రిజల్ట్స్ ఎప్పుడూ విద్యార్థుల చేతికి ఇచ్చేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులను టచ్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు.
వినూత్నంగా ఫలితాలను తెలియచేయాలని అధికారులు భావించారు. whatsapp, Gmail ద్వారా పరీక్షా ఫలితాలను పంపేందుకు సిద్ధమౌతున్నాయి. అన్ిన కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఫలితాలను నేరుగా కాకుండా..ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరవేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే..పాఠశాలల ఫోన్లు అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫోన్ చేసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫాలో కావాలని ఇతర విద్యాసంస్థలు ఆలోచిస్తున్నాయి. విద్యాసంస్థలను మరిన్ని రోజులు మూసివేయించాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది.
Read More :హాస్టళ్ల మూసివేత..ఇప్పుడెలా..ఎక్కడికెళ్లాలె