TS SSC Recounting : తెలంగాణ పదో తరగతి ఫలితాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పై బిగ్ అప్డేట్.. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే..
TS SSC Recounting Re Verification: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా.. ఎప్పుటి నుంచి అప్లై చేసుకోవాలంటే..
Telangana ssc results 2026 students can apply for recounting reverification from april 30 to may 14 fee details here
TS SSC Recounting: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల విడుదల నేపథ్యంలో సర్కార్ కీలక ప్రకటన చేసింది. మార్కుల రీకౌంటింగ్ కోసం ఈ నెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. రీకౌంటింగ్ కోసం రూ. 500 చెల్లించాలని తెలిపింది. రీ-వెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ. 1,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మార్కులు తక్కువ వచ్చాయని అనుమానం ఉన్న విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. నేడు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తంగా 95.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 5,751 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. తెలంగాణ వ్యాప్తంగా 6 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నేడు విడుదల చేసిన ఫలితాల్లో 96.26 శాతంతో బాలికలు పైచేయి సాధించారు.
ఫలితాలను results.bsetelangana.org తోపాటు https://10tv.in లోనూ చెక్ చేసుకోవచ్చు. అలానే ఫలితాలు చెక్ చేసుకోవాలని భావించే వారు… అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కాక.. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
- వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం:
- మొదట 80969 58096 నంబర్కు వాట్సాప్లో ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ‘SSC Results’ అని టైప్ చేయాలి.
- ఆ తర్వాత హాల్టికెట్ నంబర్ ఇస్తే ఫలితాల వివరాలు వస్తాయని అధికారులు తెలిపారు.
