ఆయుర్వేద వైద్యంతో కరోనాకు చెక్..మార్గదర్శకాలు విడుదల చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ

  • Published By: nagamani ,Published On : November 5, 2020 / 04:02 PM IST
ఆయుర్వేద వైద్యంతో కరోనాకు చెక్..మార్గదర్శకాలు విడుదల చేసిన ఆయుష్ మంత్రిత్వశాఖ

Updated On : November 5, 2020 / 4:31 PM IST

AYUSH Ministry’s COVID ‘Remedies’: కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తోందో కూడా చెప్పలేని పరిస్థితి. డు వచ్చేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈక్రమంలో ఆయుర్వేద వైద్యంతో కరోనాకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది.


రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని..దాని కోసం మనకు తరతరాలుగా వస్తున్న ఆయుర్వేద వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారికే కాకుండా సీజనల్ గా వచ్చే వ్యాదులను కూడా మన ఆయుర్వేదంతో ఎలా ఎదుర్కోవచ్చు తెలిపింది. ఆయుర్వేద విధానాలను అలవాటు చేసుకుంటే కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చిని వివరించింది. దీంట్లో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.


చేతులను కడుక్కోవాలి..
ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఏవైనా వస్తువులను తాకిన వెంటనే చేతులను సబ్బుతోకానీ, శానిటైజర్‌తో కానీ శుభ్రం చేసుకోవాలని..ముఖానికి మాస్కులు ధరించాలని..ప్రతీ మనిషికి మనిషికీ మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది.


గోరువెచ్చని నీటిని తాగండీ..శ్వాసకోస సమస్యలను నివారించుకోండీ..
చల్లటి నీరు కాకుండా నీటిని తాగే ప్రతీ సారి గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా శ్వాసకోస సమస్యలను నివారించవచ్చని తెలిపింది.ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరం లోపాల వున్న మలినాలు మరియు విషపదార్థాలను బయటకు తొలగించి శరీరంని శుభ్రపరుస్తుంది మరింత పలితాలు కోసం తేనె మరియు నిమ్మరసం కలుపుకోవచ్చు.



యోగాసనాలు..ప్రాణాయామాలు
అంతేకాదు యోగా వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చనీ తెలిపింది. ప్రతీ రోజు ఎంత బిజీగా ఉన్నా వీలు చేసుకుని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించింది. ఉదయాన్నే 10 గ్రాముల చ్యవన్‌ప్రాశ్ తీసుకోవాలని, మధుమేహం ఉన్నవారు తియ్యదనం లేని చ్యవన్‌ప్రాశ్‌ను తీసుకోవాలని పేర్కొంది.



పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగాలి..
వీలైతేనే కాదు వీలు చేసుకుని గోరువెచ్చని నీటిలో గానీ పాలల్లో గానీ కాస్తంత పసుపు కలుపుకుని ఉదయం, సాయంత్రం వేళలో తాగాలని సూచించింది.

వంటల్లో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి,అల్లం, మిరియాలు వంటి వేడిని కలిగించే వస్తువుల్ని ఎక్కువగా వాడాలని వీటిని ప్రతీరోజు ఆహారంలో తప్పనిసరిగా వినియోగించాలని సూచించింది. అలాగే అశ్వగంథను వాడితే మంచి ఫలితం ఉంటుంది సూచించింది.



నువ్వులు, లేదంటే కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని రెండుమూడు నిమిషాలు పుక్కిలించి ఉమ్మివేయాలని, అనంతరం గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. పొడిదగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసుకుని ఆవిరి పీల్చాలని, దగ్గు, గొంతులో చికాకు ఉంటే బెల్లం లేదంటే తేనె కలిపిన లవంగం పొడిని రెండుమూడు సార్లు తీసుకోవాలని సూచించింది.



ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి
కరోనా నుంచి కోలుకున్న వారు గోరువెచ్చని నీటినే తాగాలని, ధూమపానం, మద్యపానం అలవాట్లను విడిచిపెట్టాలని తెలిపింది. అలాగే, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


ఆయుర్వేదం అంటే ఏమిటీ?..
ఆయుర్వేదం అనే పదం సంస్కృత పదాల నుండి వచ్చిన అద్భుతమైన పదం. ‘‘ఆయుః అంటే జీవితం..వేదం అంటే శాస్త్రం లేదా జ్ఞానం’’. దీన్ని అక్షరాలతో అనువదిస్తే జీవిత శాస్త్రం అని అర్ధం వస్తుంది.