గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ ప్రమాదం : అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 12:17 PM IST
గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ ప్రమాదం : అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

Updated On : November 23, 2019 / 12:17 PM IST

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు బోల్తా పడిన ఘటనలో సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. ఆమె కూతురు ప్రణీతతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు ఆటోలు, పలు కార్లు ధ్వంసం అయ్యాయి. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గత నెల 10వ తేదీన ఇదే ప్లైఓవర్‌ పైనుంచి బైక్‌ కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. 

మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజుల పాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై వేగాన్ని నియంత్రించేందుకు జీహెచ్ ఎంసీ చర్యలు చేపట్టనుంది. 

మిలాన్ అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లైవోవర్ కింద ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై కారు పడటంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కూతురితోపాటు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

ఫ్లైఓవర్‌ స్పీడ్ కు మించి వేగంతో కారు వెళ్తోంది. కారు 100కు పైగా స్పీడ్ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 40 స్పీడ్ వెళ్లాల్సిన డ్రైవర్ ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో కారు బోల్తా పడి, చెట్టును ఢీకొట్టడంతోపాటు మహిళపై పడటంతో స్పాట్ లోనే మృతి చెందింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమా, లేదా వేరే కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 10వ తేదీన ఇదే ప్లైఓవర్‌ పైనుంచి బైక్‌ కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

సీపీ సజ్జనార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ఫ్లైవోవర్ పై ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో అధ్యయనం చేసి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. 40 స్పీడ్ వెళ్లాల్సిన కారు..90 నుంచి 100 స్పీడ్ వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఎవరు కూడా ఫ్లైవోవర్ పై నిల్చొవద్దని, అతి వేగంతో వెళ్లొద్దన్నారు. మృతురాలు సత్యవేణి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చెట్టు లేకపోయి ఉంటే ప్రమాదం తీవ్రత అధికంగా ఉండేదని భావిస్తున్నారు. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఫ్లైవోవర్ పైకి వెళ్లాల్సిన వాహనాలను డైవర్ట్ చేసి కిందికి పంపుతున్నారు.  

ప్రత్యక్ష సాక్షి…
ప్రత్యక్ష సాక్షి కారు ప్రమాదం జరిగిన వివరాలను తెలిపారు. సెక్షన్లలో ప్రమాదం జరిగింది. కారు పడటంతో తల్లి చనిపోయింది. ఆమె తల టైర్ కింద ఇరుక్కుని మెడ విరిగిపోయింవది. లివర్ బయటికి వచ్చింది. కూతరుకు గాయాలు అయ్యాయి. మరో ముస్లిం అమ్మాయికి నడుము విరిగింది. కారులో ఉన్న అతన్ని బయటికి తీయడానికి 15 నిమిషాలు పట్టింది. డ్రైవర్ బాగానే ఉన్నాడు. సీటు బెల్టు పెట్టుకున్నాడు. అప్పటికే తాను ప్రమాదం షాక్ నుంచి తేరుకోలేదని, సినిమా షూటింగ్ అనుకున్నానని వివరించారు.