కేసీఆర్ నిర్ణయం ఏంటి : సమ్మె పరిష్కారానికి మాజీ జడ్జీలతో కమిటీ

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్‌ను దీనిపై

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 02:17 AM IST
కేసీఆర్ నిర్ణయం ఏంటి : సమ్మె పరిష్కారానికి మాజీ జడ్జీలతో కమిటీ

Updated On : November 13, 2019 / 2:17 AM IST

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్‌ను దీనిపై

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్‌ను దీనిపై నిర్ణయం తెలపాలని ఆదేశించింది. అనంతరం విచారణను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. త్రిసభ్య కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది.

తెలంగాణలో ఆర్టీసీ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీ వేస్తామని హైకోర్టు ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని అడ్వకేట్‌ జనరల్‌కు సూచించింది. దీంతో హైకోర్టు ప్రతిపాదనను సర్కార్‌ దృష్టికి తీసుకెళ్తామని ఏజీ చెప్పడంతో… తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సమస్యను పరిష్కరించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి చాలాసార్లు సూచించామన్న ధర్మాసనం… నెల రోజుల గడువిచ్చినా ఫలితం లేదని వ్యాఖ్యానించింది. ఏమాత్రం అవకాశమున్నా సమస్యకు పరిష్కారం చూపించాలని మరోసారి సూచించింది. లేకపోతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయడంపై సర్కార్‌ అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది.

సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్వాగతించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేస్తే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని అశ్వత్థామరెడ్డి మరోసారి కోరారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని విద్యాసాగర్‌ గుర్తు చేశారు.

దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని న్యాయవాది విద్యాసాగర్‌ తెలపగా… పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరు నెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని… చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని అభిప్రాయపడింది.

మరోవైపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలపగా… దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. తదుపరి విచారణ వాయిదా పడింది.