పవన్, మాయావతి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 02:09 AM IST
పవన్, మాయావతి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం

Updated On : April 2, 2019 / 2:09 AM IST

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జనసేన తరపున  ప్రచారం నిర్వహించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇవాళ సాయంత్రం ఏపీకి వస్తున్నారు. రేపు, ఎల్లుండి ఆమె ఏపీ, తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.  రేపు విశాఖలో మధ్యాహ్నం పవన్‌, మాయావతి సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో జరిగే బహిరంగలో పాల్గొంటారు. ఇక 4వ తేదీ మధ్యాహ్నం తిరుపతిలో నిర్వహించనున్న ఎన్నికల సభలో మాయావతి, పవన్‌ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభకు హాజరవుతారు.