తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు వీరే

తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో చైర్మన్, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు వీరే

New Project (3)

తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో చైర్మన్, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో చైర్మన్, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ పదవులన్నీ అధికార టీఆర్ఎస్  ఖాతాలోకే చేరుతున్నాయి. చాలా చోట్ల డీసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్లు, ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గా నాందేవ్ కాంబ్లే, వైస్ చైర్మన్ గా రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గా తిప్పని లింగయ్య, వైఎస్ చైర్మన్ గా కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ గా కూరాకుల నాగభూషయ్య, వైఎస్ చైర్మన్ గా వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ గా రాయల శేషగిరిరావు, వైఎస్ చైర్మన్ గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైఎస్ చైర్మన్ గా వెంకటేశ్వర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గా గుగులోతు రామస్వామి, వైఎస్ చైర్మన్ గా దేశిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా దయాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గా వట్టి జానయ్య యాదవ్, వైఎస్ చైర్మన్ గా నారాయణరెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా రమేశ్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గా నల్లవెల్లి మోహన్, వైఎస్ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు. రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ గా మనోహర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్ గా కృష్ణారెడ్డి, వైఎస్ చైర్మన్ గా మధుకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ గా నిజాం పాషా, వైఎస్ చైర్మన్ గా వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్ గా ప్రభాకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా హర్యా నాయక్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ గా కొండూరు రవీందర్, వైఎస్ చైర్మన్ గా రమేశ్, డీసీఎంబీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా ఫక్రిద్దీన్ ఎన్నికయ్యారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గా పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్ గా మల్కాపూర్ శివకుమార్, వైఎస్ చైర్మన్ గా రమేశ్ ఎన్నికయ్యారు.