టీఎస్-ఐపాస్ : హైదరాబాద్లో లక్షల ఐటీ ఉద్యోగాలు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ విధానంతో సాఫ్ట్ వేర్..హార్డ్ వేర్ కంపెనీలతో పాటు పలు మేకింగ్ కంపెనీలు..ఏరోస్పేస్..ఫార్మా రంగంలోని దిగ్గజ కంపెనీలు వందల సంఖ్యలో హైదరాబాద్కు క్యూ కట్టాయి. నగర శివార్లలో కొలుదీరేందుకు సిద్ధపడుతున్నాయి. వీటిలో ప్రధాన సయెంట్, వాల్యూ ల్యాబ్స్, వర్చూసా, యాక్సెంచర్, ఏడీపీ వంటి పలు కంపెనీలున్నాయి.
నగర శివార్లలో ఐటీ కంపెనీలు:
6 నెలలుగా నగర శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మహేశ్వరం, బుద్వేల్లతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఐటీ, హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు 55 కంపెనీలు అఫ్లై చేసుకున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. రానున్న 2 సంవత్సరాలలో ఈ కంపెనీల ఏర్పాటుతో 3.30 లక్షలమందికి ప్రత్యక్షంగాను..పరోక్షంగా ఉద్యోగ..ఉపాధి అవకాశాలు భారీగా లభించనున్నాయి. రూ.18,400 కోట్ల పెట్టుబడులతో పలు సంస్థలు 255 దరఖాస్తులు అందగా ఇందులో 60 మేకింగ్ సంస్థలు..80 ప్లాస్టిక్.. 40 ఏరోస్పేస్ విడిభాగాలు తయారీ సంస్థలు..మరో 20 ఫార్మా కంపెనీలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
2015 నుంచి హైదరాబాద్ లో పెరుగుతున్న సంస్థలు
లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్–ఐపాస్కు పరిశ్రమల నుంచి విశేష స్పందన వస్తోంది. 2015 నుంచి సిటీ అవుట్ కట్స్ లలో వివిధ రకాల కంపెనీల ఏర్పాటుకు 800 దరఖాస్తులు అందగా.. వీటిలో 478 పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని..28 వేల కోట్లపెట్టుబడులు నగరంలో ఏర్పాటయ్యాయని సదరు కంపెనీలు తెలిపాయి. రానున్న రెండేళ్లలో మిగతా పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు 100 వరకూ నగర శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్సిటీ పరిసర ప్రాంతాలలో ఏర్పాటయ్యాయి. వీటిలో కొత్తగా 50 వేలమందికి ఉపాధి లభించినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల్లో 5 లక్షలమంది ఉపాధి పొందుతున్నారని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.