PM Modi: ప్రధాని మోదీ హత్యకు సీఐఏ కుట్ర..? అమెరికా ఆఫీసర్ అనుమానాస్పద మరణంతో అనేక సందేహాలు..
ఆగస్టు 31న బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు.
PM Modi: భారత ప్రధాని మోదీ హత్యకు సీఐఏ కుట్ర చేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడీ అనుమానాలు సంచలనంగా మారాయి. ఈ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్ లో యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. దీంతో ఒక్కసారిగా అనేక సందేహాలు తలెత్తాయి.
US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్లో చనిపోయాడు. అతడి మరణం మిస్టరీగా మారింది. అనుమానాలకు దారితీసింది. ప్రధాని మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్ను హతమార్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కారులో రహస్యంగా చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఆగస్ట్ 31న బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ లో అమెరికా నిఘా చర్యలపై సందేహాలను రేకెత్తిస్తోంది. అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమానాలకు తావిచ్చింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారా అనే అనుమానాలు తలెత్తాయి. ప్రధాని మోదీని హత్య చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చన్నది విశ్లేషకుల మాట. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారట.
హోటల్ గదిలో శవమై కనిపించాడు..
టెరెన్స్ అర్వెల్లె జాక్సన్ ఆగస్టు 31న ఢాకాలోని తన హోటల్ గదిలో చనిపోయి కనిపించాడు. సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి అతడిని బంగ్లాదేశ్లో నియమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా అధికారి జాక్సన్ మృతి చెందిన రోజు ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాంజిన్లో ఉన్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు లోపల తీవ్రమైన చర్చలు జరిపారని సమాచారం.
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంలో భారత్, రష్యా నిఘా దళాలు సంయుక్త ఆపరేషన్లో ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్న అమెరికా భద్రతా అధికారిని ఢాకాలో మట్టుబెట్టాయని విశ్లేషిస్తున్నారు. టియాంజిన్లో కారు లోపల 45 నిమిషాల పాటు జరిగిన ప్రణాళిక లేని సంభాషణలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఈ అత్యంత హైప్రొఫైల్ అంశం గురించి చర్చించి ఉండే అవకాశం ఉంది. మోడీ, పుతిన్ రహస్య చర్చలు జరిపిన రోజే ఢాకాలో అమెరికా అధికారి చనిపోయి కనిపించాడు.
సెప్టెంబర్ 2న చైనాలోని టియాంజిన్ నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజు ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. “నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా?” అని ప్రధాని మోదీ అడిగారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని మోదీ చేసిన ఈ నిగూఢ వ్యాఖ్యల వెనుక ఏదో అర్థం ఉందని తెలుస్తోంది. ఇది ప్రధాని ప్రాణాలకు ముప్పు గురించి హెచ్చరికలను పంపుతుంది.
Also Read: అద్దెకు సైన్యం..! డబ్బు కోసం దిగజారిన పాకిస్తాన్.. సౌదీతో కీలక ఒప్పందం వెనుక..
