Pakistan: పాకిస్తాన్‭లో క్రూరత్వం.. దేవుడిని దూషించాడని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి లాగి మరీ చంపేశారు

చాలా మంది ఈ దారుణాన్ని చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాలలు సైతం పోలీస్ స్టేషన్‌ గేట్లను ఎక్కి, లోపలికి చొచ్చుకెళ్లి, బాధితుడిని బయటకు లాక్కొచ్చినట్లు ఈ వీడియోల్లో చూడొచ్చు. ఇక స్థానికుల చెప్తున్న కథనం మరోలా ఉంది. వారిస్ తన మాజీ భార్య ఫొటోను ఖురాన్‌పై అతికించి, భూతవైద్యం చేస్తుండటంతో ఈ ముష్కరులు ఆగ్రహం గురైనట్లు పేర్కొన్నారు

Pakistan: పాకిస్తాన్‭లో క్రూరత్వం.. దేవుడిని దూషించాడని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి లాగి మరీ చంపేశారు

Pak man accused of blasphemy dragged out of police staion the killed By Mob

Updated On : February 12, 2023 / 12:36 PM IST

Pakistan: దైవ దూషణ కింద జరిగే ఆకృత్యాలు ఆగడం లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మన పొరుగు దేవం పాకిస్తాన్‭లో అయితే తీవ్ర స్థాయిలో ఉంటుంది. దీనికి తాజాగా అక్కడ జరిగిన ఒక సంఘటనే మంచి ఉదాహరణ. ఓ వ్యక్తి దైవ దూషణకు పాల్పడ్డలు ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొందరు ముష్కరులు పోలీస్ స్టేషన్ చేరుకుని లాకప్‭లో ఉన్న అతడిని బయటికి లాగి కొట్టి చంపారు. మృతుడి పేరు మహమ్మద్ వారిస్. ఈ ఘటన జరిగింది పాకిస్తాన్‭లోని నన్‌కానా సాహిబ్ ప్రాంతం వర్బర్టన్‌లో.

Bharat Jodo Yatra: యాత్ర నుంచి తప్పుకోనున్న రాహుల్ గాంధీ.. కారణమేంటో తెలుసా?

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘మహమ్మద్ వారిస్ అనే వ్యక్తి దైవ దూషణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. దీంతో మేము ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాము. అయినప్పటికీ ముష్కరులు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి, ఆ వ్యక్తిని బయటకు లాక్కెళ్లారరు. అతడిని కొట్టుకుంటూ, వీధిలో ఈడ్చుకెళ్తూ, నగ్నంగా ఊరేగించారు. చివరికి వారిస్ ప్రాణాలు కోల్పోయాడు’’ అని తెలిపారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడు ఖురాన్‌ను అపవిత్రం చేసినట్లు ముష్కరులు ఆరోపించారు.

Turkey-Syria Earthquake: సహాయక చర్యల్లో అద్భుతం.. ఆ ఐదుగురిని కాపాడేశారు

చాలా మంది ఈ దారుణాన్ని చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాలలు సైతం పోలీస్ స్టేషన్‌ గేట్లను ఎక్కి, లోపలికి చొచ్చుకెళ్లి, బాధితుడిని బయటకు లాక్కొచ్చినట్లు ఈ వీడియోల్లో చూడొచ్చు. ఇక స్థానికుల చెప్తున్న కథనం మరోలా ఉంది. వారిస్ తన మాజీ భార్య ఫొటోను ఖురాన్‌పై అతికించి, భూతవైద్యం చేస్తుండటంతో ఈ ముష్కరులు ఆగ్రహం గురైనట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ సంఘటనపై స్పందించారు. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ హింసాకాండను నిరోధించడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. శాంతిభద్రతలను పరిరక్షించాలని పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.