500 మందికి అన్నం పెట్టిన హీరో..

లాక్‌డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారమందించిన హీరో శ్రీకాంత్..

  • Published By: sekhar ,Published On : April 15, 2020 / 11:57 AM IST
500 మందికి అన్నం పెట్టిన హీరో..

Updated On : April 15, 2020 / 11:57 AM IST

లాక్‌డౌన్ వేళ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారమందించిన హీరో శ్రీకాంత్..

హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం  జరిగింది. హీరో శ్రీకాంత్‌తో పాటు శ్రీమిత్ర చౌదరి,  డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ స‌హా ప‌లువురు పోలీస్ సిబ్బంది యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ ముందు ఫుడ్ ప్యాకెట్స్‌ను అందచేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘ఈ కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు పర్మిషన్‌తో, వారి ఆధ్వర్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం.  పోలీసుల సహకారం మరువలేనిది.

Read Also : వెయ్యిమందికి సాయం.. అమితాబ్ ఆశ్చర్యపోయారు.. అభినందించారు..

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. లాక్‌డౌన్ ఉన్నంతకాలం నాకు చేతనైనంత వరకు నేను ఇలా సాయం చేయాలనుకుంటున్నాను. అందరూ ఇంట్లో ఉండి క‌రోనా మహమ్మారిని తరిమికొట్టాలి’’ అన్నారు.