Sobhita Dhulipala : అమ్మా.. అనే పిలుపు కోసం ఆ నటి వెయింటింగ్ అట
శోభితా ధూళిపాళ ఇటు సినిమాలు అటు ఓటీటీలో పాపులారిటీ సంపాదించుకున్నారు. హాలీవుడ్లో కూడా అడుగులు వేస్తున్న ఈ నటి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
Sobhita Dhulipala : మోడల్గా కెరియర్ మొదలుపెట్టి మిస్ ఇండియా అందాల పోటీల్లో మెరిసిన బ్యూటీ శోభితా ధూళిపాళ సినిమాల్లో, వెబ్ సిరీస్లో దూసుకుపోతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అమ్మ అనే పిలుపుకోసం తాను వెయిటింగ్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Shanmukh Jaswanth : సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. డిప్రెషన్ లో ఉన్నాను.. అందుకే గంజాయి తీసుకున్నా..
శోభితా ధూళిపాళ 2016 లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అడవి శేష్ హీరోగా వచ్చిన ‘మేజర్’ సినిమాలో కీ రోల్లో నటించారు. తమిళనాట ‘పొన్నియన్ సెల్వన్’ శోభితకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శోభిత ఓటీటీ ప్రాజెక్టులతో బాగా ఫ్యామస్ అయ్యారు. మేడ్ ఇన్ హెవెన్, బర్ద్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి బాలీవుడ్ వెబ్ సిరీస్ బాగానే క్లిక్ అయ్యాయి. కాగా ఈ నటి ఇటీవల ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
Divvya Khosla Kumar : స్టార్ ప్రొడ్యూసర్తో నటి విడాకులు?
శోభిత ఇటీవల జీవితానికి అర్ధం చెబుతూ తనకు పెద్దగా లక్ష్యాలు అంటూ ఏవీ లేవని.. చేసే పనిలోనే ఆనందం వెతుక్కుంటానని.. అందుకే ఏది పోగొట్టుకున్నట్లుగా ఉండనని సమాధానం చెప్పారు. కానీ జీవితంలో అమ్మ అవ్వడం.. అమ్మా అని పిలిపించుకోవడం ఎంతో బావుంటుందని.. అది ఎప్పుడు అనుభవిస్తానో కానీ అద్భుతంగా ఫీలవుతానని శోభిత చెప్పుకొచ్చారు. ఆ మధ్య నాగ చైతన్య, శోభిత డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు వచ్చాయి. పెళ్లి చేసుకోబోతున్నారంటూ చర్చించుకున్నారు. దీనిపై ఇద్దరూ స్పందించలేదు. కాగా శోభిత ప్రస్తుతం ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీతో పాటు ‘సితార’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు.