Akkineni Cousins : ఎన్నికల వేళ అక్కినేని కజిన్స్ అంతా ఒకేచోట.. వైరల్ అవుతున్న ఫొటో..

అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట చేరిన ఫొటో వైరల్ అవుతుంది.

Akkineni Cousins : ఎన్నికల వేళ అక్కినేని కజిన్స్ అంతా ఒకేచోట.. వైరల్ అవుతున్న ఫొటో..

Akkineni Family Cousins Get together Photo goes Viral

Updated On : May 12, 2024 / 11:56 AM IST

Akkineni Cousins : దేశమంతా ఎన్నికల వేవ్ కనిపిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపే ఎన్నికలు కావడంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు పయనమయ్యారు. నేడు ఆదివారం సెలవు దినం కూడా కావడంతో ముందుగానే అందరూ ఇళ్లకు వెళ్లి ఫ్యామిలీలతో సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట చేరిన ఫొటో వైరల్ అవుతుంది.

Also Read : Allu Arjun – Shilpa Ravi : వైసీపీ నేత శిల్పా రవి, అల్లు అర్జున్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? బన్నీకి రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా?

హీరో సుశాంత్.. అక్కినేని, వారి కుటుంబంలోని కజిన్స్ అంతా ఒకేచోట చేరిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫొటోలో నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ.. మరికొంతమంది కజిన్స్ ఉన్నారు. ఇలా అందరూ ఒకే చోట చేరిన ఫొటోని షేర్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారయింది. ఇక అక్కినేని అభిమానులు ఈ ఫొటోని తెగ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sushanth A (@iamsushanth)

ఈ ఫొటోలో ఉన్న అక్కినేని కజిన్స్ అంతా సినిమాలతో, బిజినెస్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నా ఇలా ఫ్యామిలీ కోసం కొంచెం సమయం కేటాయించి ఆదివారం పూట అందరూ కలవడం అభినందించదగ్గ విషయం.