Chiranjeevi: చిరు మళ్లీ మొదలుపెట్టాడు!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, చిరు ఇప్పుడు....
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, చిరు ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. రీసెంట్గా ఆయన వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక రావడమే ఆలస్యం అన్నట్లుగా ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ఫాదర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆయన తాజాగా ప్రారంభించారు.
Chiranjeevi: చిరు సినిమాపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన డైరెక్టర్!
ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తాజాగా వెకేషన్ ముగించుకుని వచ్చిన చిరు, గాడ్ఫాదర్ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు చివరిదశకు చేరుకోగా.. ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్తో చిరు నెక్స్ట్ సినిమాల్లో మార్పులు??
దీంతో ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను మొదలుపెట్టారు చిరు. ఇక ఈ సినిమా పూర్తిగా పొలిటిక్ థ్రిల్లర్గా రానుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోండగా, సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.