Chiranjeevi : సింగర్స్‌ని బెంగుళూరు ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లిన మెగాస్టార్.. వెళ్ళింది వెకేషన్‌కా? విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్‌కా?

తాజాగా కీరవాణి, అతని మ్యూజిక్ టీమ్, ఈ సినిమాకి పాటలు పాడే సింగర్స్ అందరూ కలిసి చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లారు.

Chiranjeevi : సింగర్స్‌ని బెంగుళూరు ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లిన మెగాస్టార్.. వెళ్ళింది వెకేషన్‌కా? విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్‌కా?

Keeravani and Vishwambhara Music Team went to Megastar Chiranjeevi Bengaluru farm house

Chiranjeevi – Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆనవాయితీ పోవడంతో విశ్వంభర సినిమాతో మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు.

ఇటీవల చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్, డైరెక్టర్, నిర్మాత.. ఇలా అందరూ విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోని ఇటీవల చిరంజీవి కీరవాణి పుట్టినరోజు నాడు షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. తాజాగా కీరవాణి, అతని మ్యూజిక్ టీమ్, ఈ సినిమాకి పాటలు పాడే సింగర్స్ అందరూ కలిసి చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లారు.

Also Read : Kalki – Hanuman : 20 రోజుల ‘కల్కి’ సినిమా.. 50 రోజులు ఆడుతుందా..? ‘హనుమాన్’ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

మ్యూజిక్ సిట్టింగ్స్, పాటల రికార్డింగ్, కంపోజింగ్ అంతా అక్కడే చేశారు. ఇందుకోసం మెగాస్టార్, కీరవాణి, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ వశిష్ఠ, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, లిప్సిక.. చాలా మంది సింగర్స్, సాంకేతిక నిపుణులు.. అందరూ కలిసి స్పెషల్ ఫ్లైట్ లో బెంగుళూరు వెళ్లి చిరంజీవి ఫామ్ హౌస్ కి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళింది పాటల రికార్డింగ్, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే అయినా ఒక టూర్ లాగా ఎంజాయ్ చేశారు.

View this post on Instagram

A post shared by Lipsika Uday (@lipsikabhashyam)

అక్కడ ఆడుకున్నారు, అల్లరి చేశారు, చిరంజీవి, కీరవాణిలతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి విశ్వంభర మ్యూజిక్ రికార్డింగ్స్ కాస్త వెకేషన్ లా మారింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పలువురు సింగర్స్ పోస్ట్ చేయడంతో వీళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళారా? చిరంజీవితో వెకేషన్ కి వెళ్ళారా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. చిరంజీవి ఇలా అందర్నీ ఎంకరేజ్ చేస్తూ బెంగుళూరుకి తీసుకెళ్లి ఓ పక్క వర్క్ చేస్తూనే మరో పక్క మంచి రీ ఫ్రెషమెంట్ ఇచ్చినందుకు అందరూ మెగాస్టార్ ని అభినందిస్తున్నారు.