చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన అమర వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారు మనకోసం సంపాదించిన విలువైన స్వేచ్ఛను కాపాడుకుందాం.. అని తెలిపారు.