బాలయ్య మంచి మనసు : మేకప్ వేస్తే హీరో, తీస్తే మోర్ థెన్ ఏ హీరో

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.. క్యాన్సర్ పేషెంట్ స్వప్నను పరామర్శించి, ధైర్యం చెప్పారు..

  • Published By: sekhar ,Published On : November 13, 2019 / 05:05 AM IST
బాలయ్య మంచి మనసు : మేకప్ వేస్తే హీరో, తీస్తే మోర్ థెన్ ఏ హీరో

Updated On : November 13, 2019 / 5:05 AM IST

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.. క్యాన్సర్ పేషెంట్ స్వప్నను పరామర్శించి, ధైర్యం చెప్పారు..

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ మరో మారు తన మంచి మనసు చాటుకున్నారు.. ఆయన అభిమానులు మా బాలయ్య ‘మేకప్ వేస్తే హీరో, తీస్తే మోర్ థెన్ ఏ హీరో’ అంటూ బాలయ్యను పొగుడుతున్నారు. ఇతర హీరోల అభిమానులు సైతం బాలయ్యను ప్రశంసిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం అనంతపురం సోమనాథ్ నగర్‌కు చెందిన పేద విద్యార్థిని స్వప్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోందని, చికిత్సకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని అభిమానుల ద్వారా తెలుసుకున్న బాలయ్య చలించిపోయారు. స్వప్నను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకు రావాలని అభిమానులకు పిలుపు నివ్వగా.. అనంతపురం నుండి కొందరు అభిమానులు దగ్గరుండి స్వప్నను, ఆమె కుటుంబ సభ్యులను  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

Read Also : అజయ్ దేవ్‌గన్ 100వ సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’

మంగళవారం బాలయ్య స్వయంగా ఆసుపత్రికి వెళ్లి స్వప్నను పలకరించి ధైర్యం చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు బాలయ్య వారితో గడిపారు. స్వప్నకు, ఆమె కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసానిచ్చారు. స్వప్న చికిత్సకు అవసరమైన ఖర్చును పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చారు.. తన కొత్త సినిమా ‘రూలర్’ కు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఫోన్‌లో స్వప్నకు చూపించారు బాలయ్య. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు ఇప్పటికే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారని, త్వరగా కోలుకుని ఉన్నత చదువులు చదవాలని ఆశాభావం వ్యక్తం చేశారు బాలయ్య.

పేదరికంతో జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తనకు బాలకృష్ణ గారి చోరవతో జీవితంపై మళ్లీ ఆశలు చిగురించాయని, వైద్యులు, సిబ్బంది తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని స్వప్న సంతోషంగా చెప్పింది. బాలయ్య మంచిన మనసుకు స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో బాలయ్య, స్వప్నను పరామర్శిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘మనిషిగా పుట్టడం తేలికే కానీ మనిషిలా బ్రతకడం కష్టం.. ఇలాంటి ఎంతోమంది క్యాన్సర్ బాధిత చిన్నారులను బ్రతికిస్తున్న బాలయ్యా.. నువ్వు నేల మీద నడిచే దేవుడివయ్యా’ అంటూ అభిమానులు బాలయ్యను అభినందిస్తున్నారు..