Multi Starrer Movie: రామ్ చరణ్, అల్లు అర్జున్ మల్టీస్టారర్‌ మూవీ?

మెగా ఫ్యామిలీ 400 కోట్ల రూపాయలతో ఓ భారీ బడ్జెట్‌ మూవీకి..

Multi Starrer Movie: రామ్ చరణ్, అల్లు అర్జున్ మల్టీస్టారర్‌ మూవీ?

Ram Charan - Allu Arjun

మెగా కాంపౌండ్‌ నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌. అసెంబ్లీ ఎన్నికల ముందు మెగా ఫ్యామిలీలో మొదలైన పొలిటికల్‌ ఫైట్‌… సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎక్కబోతోందట..? పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్ము రేపుతున్న మెగా హీరోలు… తమ కుటుంబంలో చెలరేగిన తుఫాన్‌కు తెరదించుతూ… ఓ మల్టీస్టారర్‌ మూవీకి ప్లాన్‌ చేస్తున్నారట… మెగా, అల్లు ఫ్యామిలీ నుంచి ఇద్దరు టాప్‌ హీరోలు నటించనున్న ఈ లేటెస్ట్‌ మూవీ అప్డేట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం….

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీలో విభేదాలపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ముఖ్యంగా కృష్ణార్జునులైన చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబాల మధ్య దూరం పెరిగిందని… రాజకీయంగా రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని గాసిప్స్‌ వినిపించాయి. ఎన్నికల ప్రచారంలో మెగా కాంపౌండ్‌ అంతా పిఠాపురం వెళితే… అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం కాకరేపింది.

రెండు కుటుంబాల మధ్య గ్యాప్‌ అంటూ..
దీనికి తగ్గట్టు మెగా కుటుంబం నుంచి నాగబాబు ఎక్స్‌లో చేసిన కామెంట్స్‌తోపాటు బన్నీని సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో చెయ్యటంతో రెండు కుటుంబాల మధ్య గ్యాప్‌ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐతే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించిన మెగా ఫ్యామిలీ 400 కోట్ల రూపాయలతో ఓ భారీ బడ్జెట్‌ మూవీకి ప్లాన్‌ చేస్తుందని తాజా సమాచారం. ఈ సినిమాలో గ్లోబల్‌ హీరో రామ్‌చరణ్‌తో పాటు… అల్లు అర్జున్‌ కూడా నటించనున్నట్లు సమాచారం.

గతంలో ఎవడు సినిమాలో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరితో కలిపి మల్టీస్టారర్‌ సినిమా తీయాలని ప్లాన్‌ చేస్తున్నారట… ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌తోపాటు కొణిదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాలని ప్రతిపాదన ఉందంటున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నారంటూ టాలీవుడ్‌లో విపరీతమైన టాక్‌ నడుస్తోంది.

ఈ సినిమా ప్రకటన డిసెంబర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ పుష్ప2 మూవీ, రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నాయి. మెగా కాంపౌండ్‌ నుంచి ఇద్దరు అగ్ర హీరోలతో సినిమా చేయబోతున్నారనే సమాచారం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. సినిమా ఎలా ఉండబోతోంది? కథ ఏంటనేది ఇండస్ట్రీతోపాటు ఫ్యాన్స్‌లోనూ క్యూరియాసిటీ పెంచుతోంది.

Also Read: ‘దేవ‌ర’ నుంచి రొమాంటిక్ మెలోడి వ‌చ్చేసింది.. ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ అదుర్స్‌..