మేకప్ లేకుండా.. నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి !

రానా, సాయి పల్లవి జంటగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఘన విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఊడుగుల ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ప్రచారం లో వుంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి పూర్ గర్ల్ గా మేకప్ లేకుండా కనిపించనుంది. ఆమె ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించనుంది. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది.
ఇక అలాగే రానా ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్ గా కనిపించనుండగా వీరితో పాటు సీనియర్ నటినటలు మానవ హక్కుల నేతగా నటించనుందని టాక్. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది.