Samantha : రాజ్ ఒక్కడే అలా చేస్తాడు.. ఏ డైరెక్టర్ అలా చేయడు.. సమంత సంచలన వ్యాఖ్యలు..
సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.(Samantha)
Samantha
Samantha : సమంత దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించింది. అప్పట్నుంచే వీరి బంధం మొదలైంది. ఇప్పుడు రాజ్ ఇచ్చిన కథతో, రాజ్ – సమంత నిర్మాణంలో సమంత హీరోయిన్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా మా ఇంటి బంగారం చేసింది. ఈ సినిమా జూన్ 19 న రిలీజ్ కానుంది.
సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో రాజ్, నందిని రెడ్డి కూడా పాల్గొన్నారు.
Also Read : Chiranjeevi : ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్.. నాకు కెపాసిటీ ఉంది.. నేను రెడీ..
ఈ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను ఫ్యామిలీ మ్యాన్ కి ముందు చాలా సినిమాలు చేసాను. కానీ రైటర్స్, సినిమాకు పనిచేసే వాళ్ళు అందరూ కూర్చొని ఎవరి పాయింట్ అఫ్ వ్యూ వాళ్ళు చెప్పడం, డిస్కస్ చేసుకోవడం నేను ఎక్కడా అప్పటివరకు చూడలేదు. రాజ్ దగ్గరే మొదటిసారి చూసాను. చాలా సినిమాల్లో డైరెక్టర్ ఏది చెప్తే అదే. ఎవరి మాట వినరు. అది వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. కానీ రాజ్ చేసేది బెటర్ అవుతుంది, వర్క్ అవుతుంది అనిపిస్తుంది. చాలా మంది తెలివైన వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తే మంచి అవుట్ పుట్ వస్తుంది అని చెప్పింది.
దీంతో సమంత కామెంట్స్ వైరల్ గా మారాయి. చాలా మంది దర్శకులు తమ రైటింగ్ టీమ్ తో కూర్చొని, హీరో, కొంతమంది నటీనటులతో కూర్చొనే స్క్రిప్ట్ డిస్కస్ చేస్తారు. సుకుమార్ లాంటి స్టార్ దర్శకులు కూడా తన టీమ్ అందరితో కూర్చొనే స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారు. తర్వాత హీరోలు ఏదైనా చెప్పిన దర్శకులు వింటారు. ఇలా చాలా మంది దర్శకులు ఇతరులు చెప్పేది వినడం, అందరితో డిస్కస్ చేయడం చేస్తారు. ఈ విషయాన్ని చాలా మంది స్టేజీలపైనే చెప్పారు. కానీ సమంత ఇప్పుడు తన భర్త రాజ్ ఒక్కడే అలా చేస్తాడు. ఏ డైరెక్టర్ దగ్గరా అలా చూడలేదు అనడంతో విమర్శలు వస్తున్నాయి.
