Vinayaka Chavithi : జై జై గణేశా.. వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ.. ఎంటర్టైన్మెంట్‌ ఎమోషన్..

నేడు వినాయక చవితి సందర్భంగా జై జై గణేశా అనే ఈవెంట్ ని స్పెషల్ గా టెలికాస్ట్ చేశారు.

Vinayaka Chavithi Special Event Jai Jai Ganesha Telecast

Vinayaka Chavithi : ప్రతి పండక్కి బుల్లితెరపై ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ ని టెలికాస్ట్ చేస్తారని తెలిసిందే. నేడు వినాయక చవితి సందర్భంగా జై జై గణేశా అనే ఈవెంట్ ని స్పెషల్ గా టెలికాస్ట్ చేశారు. మల్లెమాల సంస్థ ఈ ఈవెంట్ ని రూపొందించింది. ఈ ఈవెంట్ లో జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ అన్నట్టు సాగింది. ఈ ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూలతో పాటు శివాజీ కూడా వచ్చి సందడి చేశారు. రష్మీ హోస్ట్ గా ఈ ఈవెంట్ సాగింది.

Also Read : Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి.. కొత్త సినిమా అనౌన్స్..

ఇక ఈ షోలో నటుడు శివాజీ త్వరలో ఒక షోకి జడ్జ్‌గా వస్తానని చెప్పారు. అయితే అది జబర్దస్త్ షోకి జడ్జ్‌గా వస్తారా? శ్రీదేవీ డ్రామా కంపెనీకి జడ్జ్‌గా వస్తారా? అన్నది మాత్రం చెప్పలేదు. ఈ రెండు షోలకు జడ్జీలుగా ఉన్న కుష్బూ, ఇంద్రజలను కాసేపు ఆట పట్టించారు శివాజీ. ఈ ఈవెంట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు పోటాపోటీగా స్కిట్లు, పర్ఫార్మెన్స్ లు చేశారు.

ఓ పక్క ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇటీవల వచ్చిన వరదలు, వాటి వల్ల వచ్చిన నష్టాలను కూడా ఎమోషనల్ గా చూపించారు. దీంతో ఈ జై జై గణేశా ఈవెంట్ బాగానే సక్సెస్ అయింది.

ట్రెండింగ్ వార్తలు