Passengers Fell Ill In Special Train: గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో 90 మందికి ఫుడ్ పాయిజన్

ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది.

Passengers Fell Ill In Special Train: గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో 90 మందికి ఫుడ్ పాయిజన్

భారతీయ రైల్వేలో వడ్డిస్తున్న ఆహారంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అయితే వాటి తగ్గుదలలో వేగం కనిపించడం లేదు. తాజాగా చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కావడంతో 90 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న 90 మంది ప్రయాణికులు బుధవారం (నవంబర్ 29) ఫుడ్ పాయిజనింగ్ గురించి ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూణే రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులందరికీ వైద్య సహాయం అందించామని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది. దీని కారణంగా నవంబర్ 28న రైలును పూణే స్టేషన్‌లో నిలిపివేసి ప్రయాణికులకు అవసరమైన వైద్య సహాయం అందించారు. పూణెలో రైలు 50 నిమిషాలు ఆగిన తర్వాత గమ్యస్థానానికి బయలుదేరింది. గుజరాత్‌లోని పాలిటానాలో జరిగే మతపరమైన కార్యక్రమం కోసం భారత్ గౌరవ్ రైలును ప్రత్యేకంగా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.