జైట్లీ అంత్యక్రియలు పూర్తి

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2019 / 09:40 AM IST
జైట్లీ అంత్యక్రియలు పూర్తి

Updated On : August 25, 2019 / 9:40 AM IST

ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జైట్లీకి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రముఖులు నిగమ్ బోద్ ఘాట్ కు వెళ్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ సీనియర్ నాయకులు, ఎంపీలు,వివిధ పార్టీల నాయకులు నిగమ్ బోద్ ఘాట్ కి వెళ్లి జైట్లీకి కడసారి వీడ్కోలు పలికారు