Arvind Kejriwal : ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్.. ప్రజలతోనే ఉంటాం.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం..!

Arvind Kejriwal : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారిగా స్పందిస్తూ.. 'ప్రజలకు సేవ చేసేందుకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తానని అన్నారు.

Arvind Kejriwal : ఓటమి తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్.. ప్రజలతోనే ఉంటాం.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం..!

Arvind Kejriwal's first reaction

Updated On : February 8, 2025 / 3:13 PM IST

Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం (ఫిబ్రవరి 8) విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఓడినా ప్రజలతోనే ఉంటామని, అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తానని, నగర ఓటర్ల ప్రయోజనాల కోసమే కృషి చేస్తూనే ఉంటానని అన్నారు.

బీజేపీకి అభినందనలు : కేజ్రీవాల్ 
“ధన్యావాదాలు.. ప్రజల తీర్పును మేం చాలా వినయంతో అంగీకరిస్తున్నాం. ఈ విజయానికి బీజేపీని నేను అభినందిస్తున్నాను. ఢిల్లీ ప్రజలు వారికి ఓటు వేసినందుకు అన్ని వాగ్దానాలను నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను. గత 10 ఏళ్లలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగంలో మేం చాలా పని చేసాం.


మేం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడమే కాకుండా ప్రజల మధ్యే ఉండి వారికి సేవ చేస్తూనే ఉంటాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆప్ కన్వీనర్, రెండుసార్లు సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించినట్లు ప్రకటించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Read Also : Delhi Assembly Results 2025 : ఢిల్లీ ఫలితాల్లో ‘ఆప్’ పతనానికి 5 ప్రధాన కారణాలేంటి? ఈ తప్పిదాలే కేజ్రీవాల్ పార్టీని దెబ్బతీశాయా?

ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు వర్మ ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ.. తన విజయం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నగర ప్రజలకు ఘనత దక్కుతుందని అన్నారు. అయితే, ఎన్నికల సంఘం (EC) ఇంకా న్యూఢిల్లీ స్థానం నుంచి విజేతను అధికారికంగా ప్రకటించలేదు.

13వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి కేజ్రీవాల్‌పై వర్మ 4,099 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని ఈసీ వెబ్‌సైట్ తెలిపింది. వర్మ ఓట్ల సంఖ్య 30,024 కాగా, కేజ్రీవాల్ 25,925 ఓట్లు పోలైనట్లు వెబ్‌సైట్ చూపించింది. చివరి రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది.

ఈ క్రెడిట్ ప్రధాన మోదీకే దక్కుతుంది : వర్మ స్పందన 
మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక ప్రదర్శనకు పీఎం మోదీకి క్రెడిట్ దక్కుతుందని వర్మ అన్నారు. “ఢిల్లీలో ఏర్పడబోయే ఈ ప్రభుత్వం ప్రధాని మోదీ దార్శనికతను ఢిల్లీకి తీసుకువస్తుంది. ఈ విజయానికి నేను ప్రధాని మోదీకి క్రెడిట్ ఇస్తున్నాను. ఢిల్లీ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది ప్రధాని మోదీ, ఢిల్లీ ప్రజల విజయం” అని ఆయన అన్నారు.

Read Also : Delhi Assembly Results 2025 : ఢిల్లీ ఫలితాల్లో ‘ఆప్’ పతనానికి 5 ప్రధాన కారణాలేంటి? ఈ తప్పిదాలే కేజ్రీవాల్ పార్టీని దెబ్బతీశాయా?

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 5 గెలుచుకుంది. 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 6 సీట్లు గెలుచుకుంది. మరో 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడోసారి తన ఖాతాను కూడా తెరవలేకపోయింది.

ఎన్నికల కమిషన్ ప్రకారం.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 3 స్థానాలను గెలుచుకుంది. షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖ గుప్తా, రాజౌరి గార్డెన్ నుంచి మంజీందర్ సింగ్ సిర్సా, సంగం విహార్ నుంచి చందన్ కుమార్ చౌదరి, త్రి నగర్ నుంచి తిలక్ రామ్ గుప్తా తమ స్థానాలను గెలుచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది. ఢిల్లీ కాంట్ నుంచి వీరేందర్ సింగ్ కడియన్, కొండ్లి స్థానాల నుంచి కుల్దీప్ కుమార్ గెలుపొందారు.