అయోధ్య ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలపై సలహాలివ్వండి

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 09:36 AM IST
అయోధ్య ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలపై సలహాలివ్వండి

Updated On : November 5, 2020 / 12:45 PM IST

Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​…. అందుకు తగిన విధంగా భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఆలయం చుట్టూ ఉన్న 70 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయటానికి ప్రజలు స్వచ్ఛందంగా సలహాలు, సూచనలు అందించాలని కోరింది​.



ఆలయ నిర్మాణ పురోగతిపై సమీక్షించేందుకు ఇటీవల సమావేశమైన ట్రస్ట్… పుష్కరణి, యాగ మండపం, అనుస్థాన్​ మండపం, కల్యాణ మండపాల నిర్మాణం సహా రామజన్మోత్సవం, హనుమాన్​ జయంతి, రామచర్చ, సీతా వివాహం వంటి ఉత్సవాల నిర్వహణపై ప్రజలు స్వచ్ఛందంగా తమ సలహాలు, నిర్మాణాల డిజైన్ల నమూనాలు అందించాలని కోరింది. ఈ నిర్మాణ ఆకృతుల నమూనాలు భారతీయ వాస్తుశాస్త్రం లేదా స్థాపత్య వేదం ఆధారంగా ఉండాలని సూచించారు.



ఆలయ ప్రాంగణంలోనే లైబ్రరీ, మ్యూజియం..శ్రీరామ డిజిటల్​ లైబ్రరీ, పరిశోధన కేంద్రంతో పాటు మ్యూజియం, 5వేల మంది వరకు కూర్చునేలా ఆడిటోరియం నిర్మాణానికి డిజైన్లు సూచించాలని కోరింది ట్రస్ట్​. రామకథను మంచి ఆడియో విజ్యువల్​ ఎఫెక్ట్స్​తో తిలకించేలా మినీ థియోటర్​, అయోథ్య చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సలహాలు ఇవ్వాలని సూచించింది. వీఐపీలు, పూజారులు ఉండేలా అతిథిగృహాలు, ఓ గోశాలను నిర్మించాలని ప్రణాళిక చేస్తోంది ట్రస్ట్​ .



https://10tv.in/three-gang-of-men-arrested-burglary-of-22-temples-in-kurnool/
ఆలయ ప్రాంగణంలోనే గురుకుల పాఠశాల, 51 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉండేలా నివాస గృహాలకు సైతం డిజైన్లు సూచించాలని కోరింది ట్రస్ట్​. నాల్​నీల్​ తిలా, సీతాకి రాసోయి, కుబెర్​ తిలా, అంగద్​ తిలా వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో నిర్మాణాలు ప్రధాన ఆలయంతో అనుసంధానమయ్యేలా ఆకృతులు ఉండాలని సూచించింది.