ఈ బ్రెజిల్ మోడల్ హరియాణా ఎన్నికల్లో 22 ఓట్లు వేసిందట.. స్వీటీ, సీమ, సరస్వతి పేర్లతో..: రాహుల్ ‘హెచ్ ఫైల్స్’ స్పీచ్ హైలైట్స్ ఇవే..
ఒకే ఇంటి అడ్రస్ మీద 501 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.
Rahul Gandhi: ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ‘ఓట్ చోరీ’ పేరిట ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఒక బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో 22 ఓట్లు ఉన్నాయని చెప్పారు. స్వీటీ, సీమ, సరస్వతితో పాటు పలు పేర్లతో ఆమె ఓటు వేసినట్లు ఉందని రాహుల్ తెలిపారు. (Rahul Gandhi)
రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ ఓటర్ 10 పోలింగ్ బూతుల్లో 22 ఓట్లు వేశారని అన్నారు. ఆ ఓటర్ ఐడీలన్నిటిలో ఉన్నది ఒకే ఫొటో అని, అది ఓ బ్రెజిలియన్ మోడల్దని తెలిపారు. ఆ ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ 22 ఓట్లు వేసినట్లు నమోదైందని చెప్పారు.
హరియాణాలో 25 లక్షల ఫేక్ ఓటర్లు ఉన్నారని, ఒకే మహిళ 100 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఒకే మహిళ ఫొటోతో 100 ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పారు. ఒకే ఇంటి అడ్రస్ మీద 501 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.
Also Read: ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు.. వణికిపోతున్న ఆ అధికారులు
హరియాణాలో సుమారు 19 లక్షల బల్క్ ఓటర్లు నమోదైనట్టు రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే 93,000 ఓటర్ల అడ్రస్ సరైంది కాదని తమ పార్టీ గుర్తించినట్టు చెప్పారు. హరియాణాలో తాము 5,21,619 డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని రాహుల్ చెప్పారు.
ఒకే మహిళ.. రెండు బూత్ లు.. 223 ఓటర్ ఐడీలు
ఒకే మహిళ ఫొటోతో వేర్వేరు పేర్లు, వేర్వేరు వయసులు, వేర్వేరు అడ్రస్లు ఉన్నాయని రాహుల్ అన్నారు. కేవలం రెండు పోలింగ్ బూతుల్లోనే చెక్ చేస్తే ఆమె ఫొటో 223 చోట్ల కనిపించిందని తెలిపారు.
ఓ మహిళ ఫొటోలో ముఖాన్ని బ్లర్ చేసినట్టు ఉందని రాహుల్ అన్నారు. అదే ఫొటో వేర్వేరు పోలింగ్ బూత్ ల్లో వేర్వేరు పేర్లతో కనిపిస్తోందని చెప్పారు.
హరియాణా ఎన్నికల్లో యూపీకి చెందిన ఇద్దరు బీజేపీ సర్పంచ్లు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు. అయితే, తండ్రి పేరు వేరుగా ఉండడం గమనార్హం.
