AK Antony : కొడుకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంపై కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ అభ్యర్థి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
AK Antony On Anil Antony : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ అభ్యర్థి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ రాష్ట్రం పథనంథిట్ట నియోజకవర్గం నుంచి అనిల్ పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కొడుకు అనిల్ ఆంటోనీ పోటీపై ఏకే ఆటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు అనిల్ ఎన్నికల్లో ఓడిపోవాలని ఆకాంక్షించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవాలని, తన కుమారుడి ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆంటో ఆంటోనీ విజయం సాధించాలని, ఆ మేరకు తన ప్రయత్నం ఉంటుందని చెప్పారు.
Also Read : సంపన్న లోక్సభ అభ్యర్థి ఎవరో తెలుసా.. ఆయన ఆస్తులు ఎంతంటే?
కాంగ్రెస్ నా మతం. ప్రతిపక్ష పార్టీల కూటమి భారత్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని అన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా తిరువనంతపురం నుంచి బయటకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయలేక పోతున్నానని, తాను ప్రచారం చేయకున్నా పథనంథిట్టలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తాడని, తన కుమారుడు ఓటమి ఖాయమని ఏకే ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న ఎన్నికలు భారత్, దాని రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన ఎన్నికలు అన్నారు.
Also Read : సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్
దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని ఆటోనీ చెప్పారు. మరోవైపు తన తండ్రి వ్యాఖ్యలపై అనిల్ ఆంటోనీ స్పందించారు.. తన తండ్రి పరిస్థితిని చూస్తే జాలేస్తోందని, పథనంథిట్టలో తన విజయం ఖాయమని అన్నారు.
Kerala: On his son and BJP leader Anil Antony contesting elections from Pathanamthitta Lok Sabha seat, Congress leader AK Antony says, "BJP should lose there and Congress should win in Pathanamthitta. Anto Antony (Congress candidate) will win. Congress is my religion."… pic.twitter.com/xJKdAUoEVG
— ANI (@ANI) April 9, 2024