సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్

జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్

Pothina Mahesh

Pothina Mahesh Join YCP : జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. పోతిన మహేశ్ తో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. పెంటవారిపాలెం వద్ద నైట్ క్యాంప్ నుంచి బస్సుయాత్రను బుధవారం ప్రారంభించనున్నారు. అయితే, పోతిన మహేశ్, ఆయన అనుచరులు ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం జగన్ వారికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.

Also Read : Pothina Mahesh : జనసేన పార్టీకి బిగ్‌షాక్‌.. రాజీనామా చేసిన పోతిన మహేశ్

గత రెండు రోజుల క్రితమే జనసేన పార్టీకి పోతిన మహేశ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను ఆశించారు. తనకే విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో ఆందోళనకుసైతం దిగారు. కానీ, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో.. బీజేపీ నేత సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన మహేశ్.. జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి.. తాజాగా జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : నా వద్ద ఆధారాలున్నాయ్.. అన్నీ బయటపెడతా.. పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు

పోతిన మహేశ్ కు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ నేత ఆసిఫ్ బరిలో ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కే అవకాశం లేదు. పార్టీలో పనిచేయాల్సి ఉంటుంది.. ఇదే విషయాన్ని మహేశ్ కు జగన్ చెప్పినట్లు సమాచారం. అయితే, జనసేన పార్టీకి టికెట్ దక్కకపోవటం వల్ల నేను రాజీనామా చేయలేదని, ఆ పార్టీలో పరిస్థితులు నచ్చక రాజీనామా చేసినట్లు పోతిన మహేశ్ చెబుతున్నారు. ఆయన పార్టీ మారే సమయంలో పలు విషయాలను ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోతిన మహేశ్ వైసీపీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.