ముఖ్య గమనిక : ఢిల్లీ మెట్రో సర్వీసులు బంద్
ఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా 2019, జనవరి 26వ తేదీ శనివారం ఢిల్లీలో పలు చోట్ల మెట్రో రైలు సర్వీసులు నిలిపేశారు. మెట్రో రైలు సర్వీసులకు కొన్ని చోట్ల పాక్షికంగా విఘాతం కలిగింది. ఢిల్లీ పోలీసుల సూచనలతో భద్రతా

ఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా 2019, జనవరి 26వ తేదీ శనివారం ఢిల్లీలో పలు చోట్ల మెట్రో రైలు సర్వీసులు నిలిపేశారు. మెట్రో రైలు సర్వీసులకు కొన్ని చోట్ల పాక్షికంగా విఘాతం కలిగింది. ఢిల్లీ పోలీసుల సూచనలతో భద్రతా
ఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా 2019, జనవరి 26వ తేదీ శనివారం ఢిల్లీలో పలు చోట్ల మెట్రో రైలు సర్వీసులు నిలిపేశారు. మెట్రో రైలు సర్వీసులకు కొన్ని చోట్ల పాక్షికంగా విఘాతం కలిగింది. ఢిల్లీ పోలీసుల సూచనలతో భద్రతా కారణాల దృష్ట్యా మెట్రో సేవలను పాక్షికంగా నిలిపివేశామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. లైన్ 2లో (హుడా సిటీ సెంటర్ -సమయ్పూర్ బద్లి) లైన్ 6లో (కశ్మీరీ గేట్-రాజ నహర్ సింగ్) రూట్లలో స్వల్ప మార్పులు చేశామని అధికారులు చెప్పారు.
ఆయా రూట్లలో పలు మెట్రో స్టేషన్లను ఉదయం 6 గంటలకు మూసేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓపెన్ చేస్తామన్నారు. పటేల్ చౌక్, లోక్కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఉదయం 8.45 గంటలకు క్లోజ్ చేసి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓపెన్ చేస్తామన్నారు. మెట్రో పార్కింగ్ సదుపాయాలన్నీ 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచే క్లోజ్ చేశారు. 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓపెన్ చేస్తారు.
* పాక్షికంగా ఢిల్లీ మెట్రో సర్వీసులు బంద్
* భద్రతా కారణాలతో నిలిపివేత
* ఎంట్రీ గేట్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా
* టెర్రరిస్టులు, క్రిమినల్స్ వివరాల ప్రదర్శన
* యాంటీ డ్రోన్ గన్స్ ఏర్పాటు
* మెట్రో స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు