కశ్మీర్ ను పాకిస్తాన్ లో చూపించిన జూనియర్ ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2020 / 09:37 AM IST
కశ్మీర్ ను పాకిస్తాన్ లో చూపించిన జూనియర్ ట్రంప్

Updated On : November 4, 2020 / 10:00 AM IST

donald trump jr contraoversial tweet అమెరికా ఎన్నికల పలితాలు వెలువడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్​ కుమారుడు జూనియర్​ ట్రంప్ ఓ వివాదాస్పద ట్వీట్​ చేశారు.ప్రపంచవ్యాప్తంగా ట్రంప్​కు ఉన్న మద్దతును తెలియజేసేలా ఆయన ప్రపంచ పటాన్ని ట్వీట్​ చేశారు. అత్యధిక దేశాలను ఎరుపు రంగు (రిపబ్లికన్​ పార్టీ రంగు)లో చూపిస్తూ ప్రపంచ పటాన్ని ట్విట్టర్​ లో పోస్ట్​ చేశారు.



అయితే, భారత్, చైనా దేశాల​ను నీలి రంగు (బైడెన్ పార్టీ రంగు)లో చూపించారు. అంటే భారత్ ,చైనా..​.జో బైడెన్​కు మద్దతిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యాప్​ ఉంది. కానీ భారత్​లో భాగమైన అరంతర్భాగమైన జమ్ముకశ్మీర్​,ఈశాన్య రాష్ట్రాల్ని ఇందులో ఎరుపు రంగులో చూపారు. ఇది వివాదాస్పదంగా ఉంది.