‘పూర్తిగా రద్దు చేయండి’ అంటూ దేశంలో జరుగుతోన్న ఈ గందరగోళంపై మోదీకి మమతా బెనర్జీ లేఖ
భారత్లో వైద్య సదుపాయాలు, వైద్య చికిత్స నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా గందరగోళం రేపిన నీట్ని రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలోని రాష్ట్రాలు సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు.
ఇటీవల నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల విధానాన్ని పునరుద్ధరిస్తే గందరగోళం లేకుండా దేశంలోని పరీక్ష విధానంలో మళ్లీ సాధారణ స్థితిని పునరుద్ధరించవచ్చని చెప్పారు. వైద్య విద్యార్థుల్లోనూ మళ్లీ విశ్వాసం నింపవచ్చని ఆమె అన్నారు.
పేపర్ లీక్, లంచాలు ఇవ్వడం వంటి ఘటనలు ఆశావహుల భవిష్యత్తును, విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా దేశంలోని వైద్య విద్య నాణ్యతను దెబ్బతీస్తాయని మమతా బెనర్జీ చెప్పారు.
దీంతో భారత్ లో వైద్య సదుపాయాలు, వైద్య చికిత్స నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా భారత్ లోని వైద్య కోర్సుల్లో ప్రవేశాలపై పూర్తి నియంత్రణ సాధించేందుకు వీలుగా నీట్ తీసుకొచ్చారని చెప్పారు. ఇది సరైన విధానం కాదని అన్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు.
రాజధాని నిర్మాణం ఎలా.. కన్స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం