G20 Summit : G20 శిఖరాగ్ర సమావేశాలు.. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఫుల్ డ్రస్ మాక్ డ్రిల్

ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్‌ లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

G20 Summit : G20 శిఖరాగ్ర సమావేశాలు.. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఫుల్ డ్రస్ మాక్ డ్రిల్

G20 summit

Updated On : September 2, 2023 / 11:50 AM IST

G20 Summit – Delhi Traffic Police : ఢిల్లీలో G20 సమావేశాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఫుల్ డ్రస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ భారత్ మండపంలో G20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలు G20 శిఖరాగ్ర సమావేశాలకు వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చేసిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ అడ్వయిజరి జారీ చేశారు. న్యూఢిల్లీతో సహా ఢిల్లీ అంతటా అన్ని మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, పాల బూత్‌లు, కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. నియంత్రిత జోన్‌లోకి ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సిబ్బంది, వైద్య నిపుణులు, పారా-మెడిక్స్ వారి ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడానికి అనుమతి లభించింది.

India vs Pakistan: భారత్-పాక్ మ్యాచ్.. అప్పట్లో మైదానంలో ఇలా గొడవపడ్డ క్రికెటర్లు.. ప్రేక్షకులు ఒకటే అరుపులు

అన్ని రకాల వాణిజ్య వాహనాలు, బస్సులు రింగ్ రోడ్ దాటి ఢిల్లీ సరిహద్దుల వైపు రోడ్ నెట్‌వర్క్‌లో అనుమతి ఇచ్చారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌లు, ISBTలకు ప్రయాణీకులకు అనుమతి లభించింది. న్యూ ఢిల్లీ జిల్లాలో హోటళ్లు, ఆసుపత్రులు వెళ్లే హౌస్ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ వాహనాలకు వెరిఫికేషన్ తర్వాతే అనుమతి ఇస్తారు. G20 సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ పరిసర ప్రాంతాల్లోకి ప్రైవేట్ వాణిజ్య వాహనాలకు అనుమతి లేదు.

ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్‌ లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) ప్రాంతం అధికార పరిధి వెలుపల, జాతీయ రహదారి 48 (NH-48) మినహా సాధారణ ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు. ప్రజలు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని, సెంట్రల్ ఢిల్లీలో ప్రజా రవాణా కోసం కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.

Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్.. బీజేపీ వ్యూహమేంటి.. విపక్షాల అభ్యంతరాలేంటి?

G20 సమావేశాల సందర్భంగా ఢిల్లీలో లాక్ డౌన్ పరిస్థితులు ఉండవని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, G20 సమ్మిట్ సమయంలో అధునాతన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, సాంకేతికతలను ఉపయోగించుకుని స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా రియల్ టైం ట్రాఫిక్ అప్‌డేట్‌లు, ట్రాఫిక్ నిఘా వ్యవస్థలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఆంక్షలపై ప్రజల ప్రశ్నలకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సమాధానాలు ఇస్తున్నారు. G20 ప్రతినిధులు ఇండియా గేట్, రాజ్‌ఘాట్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.