ఐదో ఫ్లోర్ నుంచి పడిన ఎయిర్ హోస్టెస్.. మర్డర్ కేసులో బుక్ అయిన బాయ్ఫ్రెండ్

ఐదో ఫ్లోర్ లో నుంచి ఓ యువతి కింద పడి మరణించడం గురుగ్రామ్లో కలకలం రేపుతుంది. ఓ గెట్ టూగెదర్ పార్టీకి వెళ్లిన సమయంలోనే ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు సెక్టార్ 65లో బెస్టెక్ పార్క్ వ్యూ స్పాలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్న 26 ఏళ్ల పెగ్గిలా భూటియాగా గుర్తించారు. ఆమె సోదరి బాబిలా భూటియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.
భూటియా బిల్డింగ్ పై నుంచి దూకిన సమయంలో అక్కడే ఉన్న ఆమె బాయ్ఫ్రెండ్ డాజెల్ శర్మ పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 11గంటల సమయంలో ఘటన గురించి సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు.
‘పెగ్గిలా తన బాయ్ఫ్రెండ్తో మూడేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు. నాలుగు వారాల నుంచి అతడు పెగిలాకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేశారు. అమితంగా ప్రేమించారు బాయ్ఫ్రెండ్ను కలవడానికి చాలా ప్రయత్నించింది. ఉన్నట్టు ఉండి అతడు.. సెక్టార్ 65లోని తన ఫ్రెండ్ నివాసంలో గెట్ టూగెదర్కు హాజరు కావాల్సిందిగా పెగ్గిలాకు మెయిల్ పంపాడు. దీంతో ఆమె అక్కడికి వెళ్లారు. అక్కడి వెళ్లాక ఈ ప్రమాదం జరిగింది’ అని బాబిలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
భూటియా అక్కడికి వెళ్లిన సమయంలోనే ప్రమాదం ఎలా జరుగుతుందని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ పైనుంచి పడిపోయి తీవ్రగాయాలతో ఉన్న భూటియాను ఆస్పత్రికి తరలించారని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని.. సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.