Union Minister Giriraj Singh : హిందువులు ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలి…కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

హలాల్ మాంసంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదని, ఒక్క ఝట్కాతో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన కోరారు.....

Union Minister Giriraj Singh : హిందువులు ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలి…కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Union Minister Giriraj Singh

Updated On : December 18, 2023 / 5:33 AM IST

Union Minister Giriraj Singh : హలాల్ మాంసంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదని, ఒక్క ఝట్కాతో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన కోరారు. బీహార్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హిందూ ఆహార ఆచారాలకు కట్టుబడి ఉండాలని మంత్రి ఉద్ఘాటించారు.

ALSO READ : Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే

హలాల్ మాంసాన్ని తినకుండా ప్రతిజ్ఞ చేయమని తన మద్దతుదారులను కోరారు. ‘‘హలాల్ మాంసాన్ని మాత్రమే తినే ముస్లింలను నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు హిందువులు తమ మత సంప్రదాయాల పట్ల ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాలి’’ అని సింగ్ పేర్కొన్నారు. ‘‘హిందూ వధ పద్ధతి ఝట్కా. హిందువులు జంతుబలి చేసినప్పుడల్లా ఒకే దెబ్బతో చేస్తారు. అలాగని హిందువులు హలాల్ మాంసాన్ని తిని తమను తాము భ్రష్టు పట్టించుకోకూడదు. వారు ఎల్లప్పుడూ ఝట్కా మాంసం తినేందుకు కట్టుబడి ఉండాలి’’అని మంత్రి సూచించారు.

ALSO READ : Pawan Kalyan: పదేళ్ల తర్వాత మళ్లీ పవన్‌ ఇంటికి చంద్రబాబు.. ఎందుకంటే?

కేవలం ఝట్కా మాంసాన్ని విక్రయించేందుకు మాత్రమే రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసే కొత్త వ్యాపార నమూనా వైపు మళ్లాలని మంత్రి వ్యాపారులను కోరారు. ఈ విషయమై కొన్ని వారాల క్రితం మంత్రి సింగ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ లాగా ప్రభుత్వం హలాల్ అని లేబుల్ చేసిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలని ఆయన కోరారు. స్థానికులతో మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, హిందువులు తమకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సాయంత్రం పూట దేవాలయాన్ని సందర్శించాలని ఆయన కోరారు.