వెరీ స్పెషల్ : ఒక్క లోక్ సభ స్థానానికి మూడు దశల పోలింగ్

అనంత్నాగ్ : దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల నగారా మ్రోగింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొనసాగేందుకు ఎన్నికల కమిషన్ విడతల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఒకే లోక్ సభ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుండడం విశేషం. అదే దక్షిణ కశ్మీర్ లోయలో ఉన్న అనంత్నాగ్ లోక్సభ స్థానం. ఈ ఎంపీ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో భాగంగా ఈసీ ప్రకటించింది.
అనంత్నాగ్ లోక్సభ స్థానం పరిధిలో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉండడంతో భద్రతా సిబ్బందికి పొంచివున్న ప్రమాదాన్ి దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. రాష్ట్రంలో ఆరు లోక్సభ స్థానాలు ఉండగా వీటికి ఐదు విడతల్లో పోలింగ్ జరుగుతుండడం మరో విశేషం. గతంలో రెండు దశల్లో ఎన్నికలు పూర్తిచేసిన జార్ఖండ్..ఒడిశాల్లో కూడా నాలుగు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్లో14 స్థానాలు, ఒడిశాలో 21 స్థానాలు ఉండగా వాటికి నాలుగు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.