Joe Biden : సెప్టెంబర్ 7-10 తేదీల మధ్య జోబిడెన్ భారత్ పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10వతేదీల మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. జో బిడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగే జి-20 నేతల సదస్సు కోసం భారత్‌ రానున్నారు....

Joe Biden : సెప్టెంబర్ 7-10 తేదీల మధ్య జోబిడెన్ భారత్ పర్యటన

Modi-Joe Biden

Updated On : August 23, 2023 / 6:29 AM IST

Joe Biden to visit India : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10వతేదీల మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. జో బిడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగే జి-20 నేతల సదస్సు కోసం భారత్‌ రానున్నారు. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం, ప్రపంచ బ్యాంకుతో సహా అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాలను పెంపొందించడం వంటి పలు ప్రపంచ సమస్యలపై బిడెన్ శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారు. (Joe Biden to visit India)

Nepali woman : నేపాలీ మహిళ ప్రియుడైన బీహార్ యువకుడి కోసం వచ్చింది…

బిడెన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జి 20 నాయకత్వాన్ని కూడా ప్రశంసించనున్నారని వైట్ హౌస్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. (PM Modi’s G20 leadership) న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ బిడెన్ కూడా జి20కి ప్రధాని మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటారు. జి20 ప్రపంచ నాయకుల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలోని ప్రపంచ నాయకుల అతిపెద్ద సమావేశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.

Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

సదస్సు దృష్ట్యా సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో దేశ రాజధానిలోని ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయనున్నారు. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే అమెరికా-ఆసియాన్ సమ్మిట్ తూర్పు ఆసియా సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకానున్నారు. భద్రత, వాతావరణ సంక్షోభం, సముద్ర భద్రత, స్థిరమైన ఆర్థిక వృద్ధిపై దృష్టి పెడుతుందని వైట్ హౌస్ తెలిపింది.