LCA తేజ్కు పోటీగా చైనా JF-17.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను తట్టుకోవడానికి పాక్కు చైనా యుద్ధవిమానం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను తట్టుకోనే సామర్థ్యం పాకిస్థాన్ దగ్గర లేదు. అందుకే భారత్ను దెబ్బతీయడానికి డ్రాగన్ సాయం కోరుతోంది. పాకిస్థాన్ కోసం JF-17 ఫైటర్ జెట్ల ఉత్పత్తిని చైనా వేగవంతం చేసింది. బాలకోట్ దాడుల తరువాత భారత వైమానిక దళం (IAF) ధీటుగా అదే యుద్ధ విమానాన్ని ప్రయోగించింది.
ఇరుదేశాలకు ఉమ్మడి శత్రువు అయినా భారత్ ను దెబ్బతీసేందుకు పాక్ చైనాతో చేతులు కలిపింది. భారత్ LCA తేజ్ కు ధీటుగా ఇప్పుడు జేఎఫ్-17 యుద్ధ విమానాన్ని ప్రయోగించాలని చూస్తోంది. అప్పుడు JF -17తో ఇండియన్ MiG21 బైసన్ను కాల్చివేసినట్లు పాక్ పేర్కొంది.
యురేషియన్ టైమ్స్ నివేదించిన ప్రకారం.. 2020 మొదటి భాగంలో జెఎఫ్ -17ల సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికంగా డెలివరీ చేసినట్టు చెబుతోంది. జూన్ 30 నాటికి, JF -17 ఉత్పత్తి రేంజ్.. గత విమానాలతో పోలిస్తే ఒక సింగిల్ విమాన ఉత్పత్తి వ్యవధిని సగటున 15 రోజులు తగ్గించినట్లు చైనా ఏవియేషన్ నివేదించింది.
JF -17 బ్లాక్ 3గా పిలిచే జెఎఫ్ -17 సరికొత్త సవరించిన వెర్షన్ 2019 డిసెంబర్లో తొలి విమానంలో ప్రయాణించినట్లు ఏరోస్పేస్ నాలెడ్జ్ మ్యాగజైన్ నివేదించింది. మార్చి 2019లో, ఫైటర్ జెట్ చీఫ్ డిజైనర్ యాంగ్వీ ప్రకారం.. JF-17 బ్లాక్ 3 అభివృద్ధి, ఉత్పత్తి జరుగుతోంది. అయితే మూడవ బ్లాక్లో JF-17 సమాచార-ఆధారిత యుద్ధ సామర్ధ్యం, ఆయుధాలు అప్గ్రేడ్ అవుతాయని చెప్పారు.
జేన్స్ విశ్లేషణ ప్రకారం.. కొత్త జెట్ మునుపటి వ్యవస్థలపై కొత్త వైడ్-యాంగిల్ హోలోగ్రాఫిక్ హెడ్-అప్ డిస్ప్లే, కొత్త ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ (IIR) ఆధారిత క్షిపణి విధానం హెచ్చరిక వ్యవస్థతో అప్ గ్రేడ్ చేసింది. JF-17 బ్లాక్ I, II వేరియంట్లు Klimov RD-93MA టర్బోఫాన్ ఇంజిన్తో పాటు JF-17 బ్లాక్ III వెర్షన్ RD-93MA లేదా చైనీస్ WS-13 ఇంజిన్ను సామర్థ్యాన్ని అందుకోనున్నట్టు చెబుతోంది.