శివుడ్ని ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే ఏమి ఫలితం వస్తుంది

  • Published By: chvmurthy ,Published On : February 21, 2020 / 01:58 AM IST
శివుడ్ని ఏ ద్రవ్యంతో అభిషేకిస్తే  ఏమి ఫలితం వస్తుంది

Updated On : February 21, 2020 / 1:58 AM IST

శివుడు అభిషేక ప్రియుడు అంటారు. కాసిని నీళ్ళు శివలింగంపై  పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు…. శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి,  పూలు …పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు కామధేనువుకాడి పశువుగా పడి వుంటుందట, ‘కల్పవృక్షంఅనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట …శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి…. సకలైశ్వర్యములు సమకూరతాయి.
 

నిశ్చలమైన  భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.  ఏ ద్రవ్యంతో భక్తులు  పరమ శివుడ్ని అభిషేకిస్తే ఏ ఫలితం వస్తుందో  ఒకసారి చూద్దాం.

 

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును 
8 .
మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

 9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.

10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.


11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.

15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.


16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును

17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న      లింగార్చనకు        ప్రత్యేక ప్రాధాన్యత ఉంది – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది  (మెత్తుట) పూజ చేస్తారు. ఆ అద్దిన  అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెడతారు.
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.


21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.

23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.