CJI : దాడులు భయంతో పని చేస్తున్నాం : సీజేఐకు పలు మీడియా సంస్థలు లేఖ
దాడులు జరుగుతాయనే భయంతోనే పనిచేస్తున్నాం అంటూ పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్ుట చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి. ‘మీడియాపై దర్యాప్తు సంస్థ అణచివేతను అంతం చేయడానికి’ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సంస్థలు అభ్యర్థించాయి.

CJI DY Chandrachud media organisation letter
CJI DY Chandrachud : దాడులు జరుగుతాయనే భయంతోనే పనిచేస్తున్నాం అంటూ పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్ుట చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి. ‘మీడియాపై దర్యాప్తు సంస్థ అణచివేత వినియోగాన్ని అంతం చేయడానికి’ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సంస్థలు అభ్యర్థించాయి. తమపై దాడులు జరుగుతాయనే భయంతోనే దేశవ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నాయి. మీరు సుప్రీం కోర్టులో ఉన్న సమయంలో..దేశంలోని దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేశారో,పత్రికలకు వ్యతిరేకంగా ఆయుధాలు ఎలా ఉపయోగించారో మీరు చూశారు అంటూ లేఖలో ఉదహరించారు.
కొన్ని రోజుల క్రితం న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ లో పని చేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. వారికి సంబంధించిన మొబైల్ ఫోన్లు,ల్యాప్ టాప్ లో వంటివి స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని… సోదాల పేరుతో కట్టడి చేసేందుకు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు చట్టానికి అతీతంగా ఉండాలని తాము కూడా కోరుకోవడం లేదని… కానీ, పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని వెల్లడించారు. జర్నలిస్టులు నిజాలు మాట్లాడినప్పుడే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందన్నారు. పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను UAPA కింద అరెస్ట్ చేశారు. ఈక్రమంలో సీజేఐకి మీడియా సంస్థలు లేఖ రాశాయి. ఆలస్యం కాకుండానే జోక్యం చేసుకోవాలని దిద్దుబాటు చర్యలు తీసుకోవలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు.
డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్, చండీగఢ్ ప్రెస్ క్లబ్, నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, బృహన్ముంబయి యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఉచితంగా సంతకం చేశాయి. స్పీచ్ కలెక్టివ్, ముంబై, ముంబై ప్రెస్ క్లబ్, అరుణాచల్ ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ప్రెస్ అసోసియేషన్, గౌహతి ప్రెస్ క్లబ్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ మరియు నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా, ఇండియా వంటి మీడియా సంస్థలు లేఖలు రాశాయి.