తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్

పొలిటికల్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాజకీయాల్లోనే కాదు. ప్రపంచ రాజకీయాల్లోనూ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాములుగా అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే ఒకవేళ ఎల్లుండు ఎన్నికలు అంటే ఇవాళ సాయంత్రానికి ప్రచారం ముగిసిపోవాలి. అయితే సోషల్ మీడియాకు మాత్రం ఇప్పటివరకు అటువంటి నిబంధనలు ఏమీ లేవు. ఎలక్షన్ ముందువరకు కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.
Read Also : పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ
అయితే ఈసారి ఎన్నికల కమీషన్ సోషల్ మీడియాపైన కూడా నిబంధనలు విధించింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు 48గంటల ముందు తమ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారాలను నిలిపివేస్తామంటూ ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ సంస్థలు స్వచ్చందంగా ప్రకటించాయి. ఇప్పటి నుంచి తాము కూడా ఎన్నికల కోడ్ను పాటిస్తామని సోషల్మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) నేతృత్వంలో జరిగిన భేటిలో కార్యాచరణను ఎన్నికల సంఘంకు తెలిపాయి.
ఆన్లైన్ ప్రచారంను నిలువరిస్తామంటూ ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా సంస్థలు హామీ ఇవ్వడం ఇదే తొలిసారి. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై సత్వర చర్యలు తీసుకుంటామని, 1951 చట్టం 126 సెక్షన్ ప్రకారం సోషల్ మీడియాలో కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇచ్చిన హామీలకు ఆయా సంస్థలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
Read Also : ఓటర్ నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదల