కేజ్రీవాల్ కు మోడీ అభినందనలు

ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 35మంది ఎమ్మెల్యేల మద్దతు అవరముంది. అయితే ఇప్పటికే ఆప్ విజయం ఖరారైపోయింది.
63స్థానాల్లో ఆప్ లీడింగ్ లో ఉండగా,కేవలం 7స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక దశాబ్దాల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ కు ఈ సారి కూడా ఒక్క సీటు కూడా దక్కలేదు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 67సీట్లు రాగా,బీజేపీకి3,కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 0తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వరుసగా 5వసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీజేపీ సీనియర్ నాయకుడు కపిల్ మిశ్రా అన్నారు. ఢిల్లీ ప్రజలతో కనెక్ట్ అవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యామని మిశ్రా అన్నారు. అద్భుతమైన విజయం సాధించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. మోడల్ టౌన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మిశ్రా ఆప్ అభ్యర్థి అఖిలేష్ పాటి త్రిపాఠి చేతిలో ఓడిపోయాడు. గతంలో ఆప్ లో పనిచేసిన మిశ్రా కేజ్రీవాల్ తో గడవల కారణంగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు పాకిస్తాన్-ఇండియా మధ్య పోటీ అని క్యాంపెయిన్ సమయంలో మిశ్రా ప్రచారం చేశారు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హైవోల్టేజ్ క్యాంపెయిన్ నిర్వహించింది. 50రోజులుగా షాహీన్ బాగ్ లో జరుగుతున్న సీఏఏ వ్యతిరేక నిరసన కార్యక్రమాన్ని ఫోకస్ చేస్తూ..బీజేపీకి ప్రజలు ఓటు వేసి షాహీన్ బాగ్ నిరసనకు తమ వ్యతిరేకత తెలియజేయాలని క్యాంపెయిన్ చేసింది. అయితే ప్రజలు బీజేపీ వ్యాఖ్యలకు స్పందించలేనట్లు సృష్టంగా కన్పిస్తోంది. కేజ్రీవాల్ కే జై కొట్టారు ఢిల్లీ ప్రజలు.