రాష్ట్రపతి శీతకాల విడిది : ట్రాఫిక్ ఆంక్షలు..ప్రత్యామ్నాయం చూసుకోండి

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది అధికారికంగా ఖరారైంది. ఆయన 2019, డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్కు చేరుకుంటారు.
ఆయకు స్వాగతం పలికేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రయాణించే వాహనాల కాన్వాయ్తో బుధవారం మధ్యాహ్నం రూట్ రిహార్సల్స్ నిర్వహించారు. ఆర్మీ అదికారులు బందోబస్తుతో పాటు..ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచీ అధికారులు
భద్రతను పర్యవేక్షించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు : –
ఇదిలా ఉంటే…రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్ – ఎయిర్ ఫోర్స బెటాలియన్ 2, 3 గేట్లు, బొల్లారం చెక్ పోస్టు, సహేజ్ ద్వార్, ఈఎంఈ సెంటర్ వదద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్ పంప్ హౌస్, బిసిన్ ఎన్విరాన్ మెంట్ పార్కు, బిసిన్ హెడ్ క్వార్టర్స్, మెయిన్ గేట్, యాప్రాల్ బిసిన్ బేకరీ ఎక్స్ టెన్షన్, నేవీ హౌస్ జంక్షన్, ఆంధ్రా సబ్ ఏరియా ఆఫీసర్స్ మెస్, ఆర్ఎస్ఐ జంక్షన్, ఈఎంఈ సెంటర్ హౌస్ గేట్ నెంబర్ 3, 2, 1, రాష్ట్రపతి నిలయం మెయిన్ గేట్ వరకు ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
* బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు బస చేయనున్నారు.
* 23న ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చెన్నై లేదా పుదుచ్చెరి వెళ్లనున్నారు.
* అక్కడి నుంచి తిరువంతపురం వెళ్లనున్నారు.
* 26న హైదరాబాద్కు తిరిగి రానున్నారు.
* మరుసటి రోజు 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.