దీదీ సంచలన వ్యాఖ్యలు : ఉగ్రదాడి గురించి మోడీకి ముందే తెలుసు 

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 03:51 AM IST
దీదీ సంచలన వ్యాఖ్యలు : ఉగ్రదాడి గురించి మోడీకి ముందే తెలుసు 

Updated On : February 19, 2019 / 3:51 AM IST

కోల్ కతా  : పుల్వామా ఉగ్రదాడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధానికి ముందే తెలుసని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ ఈ ఉగ్రదాడిని వాడుకోవాలని చూస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు.  

పుల్వామా దాడి కేంద్రానికి తెలిసే జరిగిందని చెప్పేందుకు తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని మమత పేర్కొన్నారు. నిఘా నివేదికలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదులను భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌పై ఇన్నాళ్లూ ఎందుకు మౌనం వహించారని మోడీని మమతా  నిలదీశారు.సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ దాడి ఎందుకు జరిగిందో..అంత భారీగా సైనికులు వెళ్తున్న దారిలో ఎటువంటి రక్షణ లేకుండా ఎందుకు ఉందో..నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది అని మమతా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్థాన్ పై పరోక్ష యుద్ధానికి కేంద్రం తెరలేపిందని..మోదీ మార్క్ రాజకీయానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని విరుచుకుపడ్డారు.
 

ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని నీళ్లగా  ఖర్చు చేస్తున్న ప్రధాని జవాన్లను వాయు మార్గంలో ఎందుకు తరలించలేదని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లుగా జరగనిది ఎన్నికలకు కొద్ది రోజులు జరిగితే ఏమని అర్థం చేసుకోవాలన్నారు. ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటుందని మమత అనుమానం వ్యక్తం చేశారు.