3కోట్ల రేషన్ కార్డులు రద్దు..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

3కోట్ల రేషన్ కార్డులు రద్దు..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

Scrapping 3 Crore Ration Cards For Not Linking Aadhaar Too Serious Supreme Court

Updated On : March 17, 2021 / 4:19 PM IST

Ration Cards ఆధార్​ కార్డుతో లింకు కాని రేషన్​ కార్డులను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్ర‌భుత్వ చ‌ర్య మ‌రీ దారుణంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆధార్​ తో లింక్ లేని కారణంగా కేంద్రం 3 కోట్ల రేషన్​ కార్డులను రద్దు చేసిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. నాకు ఈ సమస్య అర్ధమైంది. ఎందుకంటే ఇది వరకు నేను ఈ తరహా కేసును బొంబయి హైకోర్టులో విచారించాను’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డే వ్యాఖ్యానించారు.

ఈ పిటిషన్ నిజానికి సంబంధిత హైకోర్టులో దాఖలు చేయాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుపై త్వరలోనే తుది విచారణ చేపడతామని పేర్కొంది. నాలుగు వారాల్లోగా తదుపరి విచారణపై నోటీసులు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.