సుశాంత్‌ కేసు…డ్రగ్ డీలర్స్ తో రియా చాటింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2020 / 09:28 PM IST
సుశాంత్‌ కేసు…డ్రగ్  డీలర్స్ తో రియా చాటింగ్

Updated On : August 26, 2020 / 10:07 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ బయట పడుతోంది. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తి డ్రగ్స్‌ గురించి మాట్లాడుతున్న వాట్సాప్‌ చాట్స్‌ బయటపడింది. రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు.

రియా చక్రవర్తి…డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. ఈ వాట్సాప్ చాట్ ను రియా తొలగించినా, దీన్ని అధికారులు తిరిగి పొందారు. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం రేకెత్తింది.

‘‘మనం హార్డ్ డ్రగ్ గురించి మాట్లాడాలి. నేను దీన్ని వాడలేదు’’ అని రియా 2017 మార్చి 8వతేదీన డ్రగ్ డీలరు గౌరవ్ తో వాట్సాప్ చాట్ చేసింది. రెండోసారి మాదకద్రవ్యాల డీలరు గౌరవ్ తో రియా మాట్లాడుతూ ‘‘మీ వద్ద ఎండీ ఉందా?’’ అని అడిగింది. ఎండీ అంటే మిథిలీన్ డయాక్సీ మెథాంపేటమిన్ అని బలమైన మాదకద్రవ్యం. కాగా, ఇటీవల మహేష్‌ భట్‌, రియా వాట్సాప్‌ చాట్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

అంతేగాక శామ్యూల్ మిరాండా, రియా మధ్య జరిగిన చాట్‌ను కూడా వెల్లడైంది. ఇందులో.. ‘హాయ్ రియా, విషయం దాదాపుగా ముగిసింది. అని మిరాండా చెప్పారు. ఈ సంభాషణ 2020 ఏప్రిల్ 17 న జరిగింది. ఆ తరువాత మేము షోవిక్ స్నేహితుడి నుంచి డ్రగ్స్ తీసుకోవచ్చా? కానీ అతని దగ్గర హాష్, (బడ్‌) మొగ్గ మాత్రమే ఉన్నాయి. అని మిరాండా రియాను అడిగారు. అయితే హాష్, మొగ్గ అనేవి తక్కువ తీవ్రత కలిగిన డ్రగ్స్‌గా పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం డ్రగ్‌ డీలర్‌తో జరిగిన ఈ సంభాషణను చూస్తుంటే రియాపై మరింత అనుమానాన్ని పెంచుతున్నాయి. రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.